Sakshi News home page

ఉద్యోగం ఇస్తామని గెస్ట్‌హౌస్‌కు పిలిచి..

Published Fri, Jul 20 2018 3:22 PM

Raped By Fortey Men In Guest House Alleges Haryana Woman - Sakshi

చండీగఢ్‌ : హర్యానాలోని పంచ్‌కులాలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన 22 ఏళ్ల మహిళను గెస్ట్‌ హౌస్‌లో బంధించి నాలుగు రోజుల పాటు 40 మంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. జులై 15 నుంచి 18 వరకూ తనను మార్ని హిల్స్‌లోని గెస్ట్‌ హౌస్‌లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు చండీగఢ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుల్లో ఒకరు తన భర్తకు పరిచయమని, గెస్ట్‌ హౌస్‌లో ఉద్యోగం ఇస్తానని తనను రప్పించాడని బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టామని మణిమజ్రా పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫసర్‌ రంజిత్‌ సింగ్‌ చెప్పారు. కేసుకు సంబంధించి ఇద్దరు గెస్ట్‌ హౌస్‌ ఉద్యోగులకు అరెస్ట్‌ చేశామన్నారు. 

Advertisement
Advertisement